News

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమం


తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు మెరుగైన చికిత్సనందించేందుకు కేంద్రం ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులను చెన్నైకి పంపించింది. జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారా, లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎప్పటికప్పుడు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో చైర్మన్‌తో మాట్లాడుతున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు గవర్నర్‌తో మాట్లాడారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో అభిమానులు అపోలో ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. టీవీల ముందు కూర్చుని శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మకు ఏమీ కాకూడదని, క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థనలు చేస్తున్నారు.